వికారాబాద్: హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన శిక్షణ విమానం వికారాబాద్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో అందులోని ఇద్దరు పైలట్లు మృతిచెందారు. అందులో ఒకరిని ట్రైనీ పైలట్ ప్రకాశ్ విశాల్‌గా గుర్తించారు. బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద పంట చేనుల్లో శిక్షణ విమానం కుప్పకూలినట్లు బంట్వారం పోలీసులు తెలిపారు. ఉదయం 11.55 గంటలకు బేగంపేట్ స్టేషన్ నుంచి శిక్షణ విమానంతో సంబంధాలు తెగిపోయినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.