TS EAMCET 2021 Online Application: ఇటీవల తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. జులై 1న ఎంసెట్ 2021 ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు ముగిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్, ఇంటర్ ఫలితాలు విడుదల నేపథ్యంలో ఎంసెట్ 2021 పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జులై 8వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌ (Telangana EAMCET 2021 Applications)లో  దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఇంజనీరింగ్ దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగ అభ్యర్థులకు రూ.400, ఇతరులు రూ.800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ మరియు మెడికల్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 చెల్లించాలి.


Also Read: Telangana Zones 2021: తెలంగాణలో అమల్లోకి కొత్త జోన్లు, మొత్తం 33 జిల్లాలతో 7 జోన్లు, ఉత్తర్వులు జారీ


ఒకవేళ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎంట్రన్స్‌లకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగ అభ్యర్థులు రూ.800, ఇతరులు రూ.1,600 చెల్లించాలని నోటిఫికేషన్‌లో సూచించారు. ఇంజనీరింగ్ (TS EAMCET 2021) ప్రవేశ పరీక్షకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎంట్రన్స్‌కు దాదాపు లక్ష వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఎంసెట్ పరీక్షను ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ వారికి ఆగస్టు 4, 5 మరియు 6 తేదీల్లో, అగ్రికల్చర్ వారికి ఆగస్టు 9, 10 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.


Also Read; DOST 2021 Notification: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల‌కు దోస్త్ నోటిఫికేష‌న్ విడుదల, ముఖ్యమైన తేదీలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook