Harish Rao On Munugode: మునుగోడు ఉపఎన్నికపై సంచలన ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. మునుగోడులో గెలిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పోరాటాల గడ్డ నల్గొండ ప్రజలను బీజేపీ మోసం చేయలేదన్నారు.బీజేపీవన్ని జుమ్లా మాటలు అన్నారు హరీష్ రావు. రైతులకు ఇచ్చిన హామీలను మోడీ అమలు చేయలేదని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి మోడీ రైతులు ఉసురు తీసుకున్నారని మండిపడ్డారు. రైతులపై  మోడీ సర్కార్ ఉగ్రవాదుల ముద్ర వేసిందని చెప్పారు. 758 మంది రైతులను పొట్టన పెట్టుకుందని విమర్శించారు. రైతుల ఆందోళనతో దిగొచ్చిన ప్రధాని మోడీ.. వాళ్లకు క్షమాపణ చెప్పారని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెన్షన్ విషయంలో బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఆసరా పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. మోడీ సర్కార్ 3 వేల రూపాయల పెన్షన్ ఇస్తే.. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుజరాత్ లో కేవలం 6 వందల రూపాయల పెన్షనే ఎందుకు ఇస్తున్నారని హరీష్ రావు నిలదీశారు. హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీ నేతలు ఎన్నో చెప్పారని.. కేంద్రం నుంచి నిధులు తెస్తామని హామీ ఇచ్చారని హరీష్ గుర్తు చేశారు. ఇంతవరకు హుజురాబాద్, దుబ్బాకకు కేంద్ర సర్కార్ రూపాయి కూడా ఇవ్వలేదని వెల్లడించారు.


Read Also: Pawan Kalyan Vizag Tour Live Updates: విశాఖ విడిచివెళ్లాలని పవన్ కు నోటీసులు.. జనసేనాని ఏం చేస్తారో?


Read Also: Munugode Bypoll: ఒరేయ్ నా కొడకా.. నీ సంగతి చూస్తా.. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెదిరింపులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook