హైదరాబాద్: తెలంగాణలో నేడు మరో 2 కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వెలుగుచూసిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 41కి చేరింది. నేడు గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల్లో మొదట హైదరాబాద్‌లోని ఓ మహిళలో కరోనా లక్షణాలు గుర్తించారు. ఇప్పటికే ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరికి కరోనా సోకగా.. వారి నుంచి తాజాగా ఆమెకు కరోనావైరస్ వచ్చినట్టు కోవిడ్ పరీక్షల్లో తేలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"183572","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక రెండో కరోనావైరస్ పాజిటివ్ కేసు విషయానికొస్తే.. ఇటీవలే సౌది అరేబియాకు వెళ్లొచ్చిన మూడేళ్ల బాబుకు సైతం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ తాజా కేసుల వివరాలను వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..