Kishan Reddy's Nephew Jeevan Reddy Death: హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 50 ఏళ్లు. తన అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డి దంపతుల కుమారుడు జీవన్ రెడ్డి మృతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుఖసాగరంలో మునిగిపోయారు. కిషన్ రెడ్డి అక్కాబావ కుటుంబం సైదాబాద్ వినయ్ నగర్‌లో నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్నప్పుడే జీవన్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవన్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అతన్ని హుటాహుటిన కాంచన్‌బాగ్‌లోని డిఆర్డిఎల్ వద్ద ఉన్న అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. జీవన్ రెడ్డి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. జీవన్ రెడ్డి హటాన్మరణంతో మేనల్లుడిని కోల్పోయానే అనే ఆవేదనతో కిషన్ రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం జరుతాయని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం నొయిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీలో ఉండగా ఈ దుర్వార్త తెలిసింది. దీంతో కేంద్రమంత్రి వెెంటనే హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యారు.


ఇది కూడా చదవండి : Hyderabad: శంషాబాద్ ఎయిర్​పోర్టులో రూ.8 కోట్లు విలువ చేసే గోల్డ్ పట్టివేత.. నలుగురు అరెస్ట్...


ఇది కూడా చదవండి : Eetala Rajender Speech: కేసీఆర్, కేటీఆర్.. మీకు దమ్ముంటే.. ఈటల రాజేందర్ సవాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook