హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)లో ఉన్న 2,939 ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అక్టోబరు 10న ఈ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో 2,438 జూనియర్‌ లైన్‌మెన్‌, 24 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, 477 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు ఉన్నాయి. 


ఖాళీలు, వాటికి అవసరమైన విద్యార్హతలు, వేతనాలకు సంబంధించిన మరిన్ని వివరాలకోసం నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత www.tssouthernpower.com, http://tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్‌లలో పరిశీలించుకోవాల్సిందిగా టీఎస్‌ఎస్‌పిడిసిఎల్ సంస్థ పేర్కొంది.