వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్... ప్రస్తుతం ఖమ్మంలో  నివాసం ఉంటున్నారు. ఆయన తన తల్లి అంత్యక్రియల కోసం కారులో ఖమ్మం నుంచి ఆదిలాబాద్ కు బయల్దేరారు. ఆయనతోపాటు భార్య, కూతురు ఉన్నారు. కారు ఎల్కతుర్తి వద్దకు రాగానే .. క్రాసింగ్ వద్ద వేగంగా వచ్చిన లారీ  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు భార్య అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్ కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరినీ హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


[[{"fid":"182063","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా..? లేక అతి వేగమే ప్రమాదానికి కారణమా..? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.