Woman commits suicide after killing her 2 children in rajendra nagar Hyderabad: తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆ తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ (Rajendranagar Police Station) పరిధిలోని పోట్వీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే సాయి ఆయన భార్య స్వాతి పిల్లలతో పాటు ఉంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సాయికు ఈ మధ్య అప్పులు ఎక్కువ కావడం వల్ల వాటిని తీర్చలేక తరచు భార్యతో (Wife) గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు భరించలేక స్వాతి తన ఐదేళ్ల కుమారుడు తన్విక్‌, మూడేళ్ల కూతురికి ఉరి వేసి.. తర్వాత ఆమె కూడా ఆత్మహత్య (Suicide) చేసుకుంది.


Also Read : Gas Leak: రసాయన పరిశ్రమలో విషవాయువు లీక్​...ఒకరు మృతి


అయితే భర్త సాయి కుమార్‌‌ (Sai Kumar) వల్లే తాను పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్వాతి (Swati) సూసైడ్‌ లేఖలో పేర్కొంది. సాయత్రం సాయి ఇంటికొచ్చేసరికి వారంతా విగతజీవులుగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు (Police) కేసు (Case) నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


Also Read : Simbu: ఆస్పత్రిలో చేరిన తమిళ హీరో శింబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook