Ananthpur Car Accident: కారు అదుపు తప్పడంతో లారీ కిందకు వెళ్లి అందులో ప్రయాణించే ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల నాయనపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద జరిగింది. కారు టైర్‌ పగలడంతో అదుపు తప్పి లారీ కిందకు వెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతపురం నుంచి కడప వైపుగా హైవేపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు అనంతపురం ఇస్కాన్‌ టెంపుల్‌గా వెళ్లివస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.మృతులంతా ఇన్కాన్‌ నగర కీర్తన వేడుకలు హాజరు అవ్వడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు వెంకన్న (35), ప్రసన్న (34), శ్రీధర్‌ (28), సంతోష్‌ (26),  వెంకీ (24), షణ్ముఖ (30) గా పోలీసులు గుర్తించారు.
 


ఇదీ చదవండి:  దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..  


అయితే, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమే అని పోలీసులు నిర్ధారించారు. హైవేపై రోడ్డు యాక్సిడెంట్‌ జరగడంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ క్లీయర్‌ చేసే పనులు చేపట్టారు
 


ఇదీ చదవండి: ప‌ల్లెటూరి స్టైల్‌లో కోడికూరను ఇలా చేస్తే.. నోట్లో ముక్క వేసుకోగానే ఆహా అంటారు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.