అనారోగ్యంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయిని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన చంద్రబాబు పనిలో పనిగా ఎయిమ్స్‌కి వెళ్లారు. మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయిని చంద్రబాబు పరామర్శించినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



యధావిధిగా జరిగే వైద్య పరీక్షల నిమిత్తం మాజీ ప్రధాని వాజ్‌పేయి జూన్ 11న ఎయిమ్స్‌లో చేరారు. అయితే, వైద్య పరీక్షల్లో ఆయన మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్టుగా తేలింది. దీంతో ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం హుటాహుటిన ఆయనకు చికిత్స ప్రారంభించింది. చికిత్స ప్రారంభించిన రెండు రోజుల తర్వాత ఆయన ఆరోగ్యంలో చాలా మెరుగుపడిందని ఎయిమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.