AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు..మళ్లీ స్వల్పంగా పెరిగి..స్థిరంగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 52 వేల 319 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..అందులో 1115 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. మరోవైపు 19 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 13 వేల 857కు చేరుకుంది. గత 24 గంటల్లో 1265 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 19 లక్షల 85 వేల 556 డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 14 వేల 693 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 66 లక్షల 29 వేలమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు. గత 24 గంటల్లో చిత్తూరులో 210, గుంటూరులో 121, ప్రకాశం జిల్లాలో 121, నెల్లూరులో 120, కృష్ణా జిల్లాలో 165 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.


Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook