AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపీలో స్వల్పంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి ఏపీలో స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు మరోసారి స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 64 వేల 461 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1321 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. గత 24 గంటల్లో 19 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 13 వేల 807 మంది మరణించారు. గత 24 గంటల్లో 1499 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 81 వేల 906 మంది కోలుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో ప్రస్తుతం 14 వేల 853 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 64 లక్షల 71 వేల 272 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు. 


Also read: Heavy Rains: రానున్న 48 గంటలు..ఆ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook