ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు నిర్ణయమైంది. బుధవారం మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపధ్యంలో రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి. ఈ రెండు ఖాళీల్ని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరి రాజీనామాల్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇప్పటికే ఆమోదించారు. రేపు కేబినెట్ విస్తరణలో కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రెండు బెర్త్ ల  భర్తీకోసం ఆశావహులు చాలామంది ఉన్నారు. ఖాళీ అయిన రెండు స్థానాలు బీసీ సామాజికవర్గానికి చెందినవి కావడంతో...అదే సామాజికవర్గంతో భర్తీ చేస్తారని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. Also read: AP: త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ కొలువుల పందేరం