హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనల్లుడు ఉదయ్‌ కుమార్‌ (43) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురైన ఉదయ్ కుమార్‌ని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడే ఈ ఉదయ్‌ కుమార్‌. ఈరోజు సాయంత్రం ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని నారావారిపల్లెకు తరలించి రేపు శనివారం ఉదయం అక్కడే ఉదయ్‌ కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నారావారిపల్లెలో జరగనున్న ఉదయ్ కుమార్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరుకానున్నట్టు వారు మీడియాకు వెల్లడించారు.