AP Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు కాస్త శాంతిస్తోంది. ఏపీలో కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. కరోనా కట్టడికై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా వైరస్ (Corona Virus) ఉధృతి తగ్గుతోంది. కరోనా మహమ్మారి కట్టడికై మే 5 వ తేదీ నుంచి ప్రభుత్వం కట్టుదిట్టమైన కర్ఫ్యూను రోజుకు 18 గంటలపాటు అమలు చేస్తోంది. మరోవైపు సంక్రమణ ఛైన్ అరికట్టేందుకు ప్రతిరోజూ భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ఫలితంగా గత కొద్దిరోజులుగా ఏపీ కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 86 వేల 223 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..11 వేల 421 మందికి పాజిటివ్‌గా తేలింది.రాష్ట్రంలో ఇప్పటి వరకూ 17 లక్షల 25 వేల 682 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 81 మంది మరణించారు. గత 24 గంటల్లో 16 వేల 223 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 11 వేల 213 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1 కోటి 95 లక్షల 34 వేల 279 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests) చేశారు. 


మరోవైపు రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష (Ap cm ys jagan) నిర్వహించారు. కరోనా నివారణకు సంబంధించి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


Also read: Anandayya Covid-19 Medicine: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ అందుకే వెనక్కి తగ్గిందా, TTD Chairman YV Subbareddy ఏమన్నారంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook