AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజుల్నించి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. మరోవైపు కఠిన ఆంక్షల్ని ఇంకా కొనసాగిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సెకండ్ వేవ్(Corona Second Wave) ఏపీలో సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. గత కొద్దిరోజుల్నించి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఏపీలో గత 24 గంటల్లో 80 వేల 376 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా..1908 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు 23 మంది కోవిడ్ కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 2 వేల 103 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 46 వేల 370 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 13 వేల 513 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల 375 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 80 వేల 258 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 51 లక్షల 8 వేల 146 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు. 


గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 438 కరోనా కేసులు, చిత్తూరులో 231, కృష్ణా జిల్లాలో 192,  గుంటూరు జిల్లాలో 216  కరోనా కేసులు వెలుగు చూశాయి.


Also read: పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో కీలక పనులు ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook