AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ గణనీయంగా తగ్గుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కన్పిస్తోంది. అదే సమయంలో పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి ఏపీలో ఇప్పుడు చాలా వేగంగా తగ్గుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్ని కూడా పెద్దఎత్తున నిర్వహిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1 లక్షా 8 వేల 616 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..6 వేల 952 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 లక్షల 3 వేల 74 మందికి కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 58 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 11 వేల 882 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు గత 24 గంటల్లో 11 వేల 577 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 91 వేల 417 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 3 లక్షల 48 వేల 106 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రోజుకు 18 గంటల కర్ఫ్యూ, భారీ ఎత్తున చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలతో (Covid19 Tests) రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది.


Also read: Aviptadil Medicine: కరోనాకు కొత్తమందు, త్వరలో మార్కెట్లో అవిప్టడిల్ మందు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook