Covid19 Update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే..ఆంధ్రప్రదేశ్‌లో సైతం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల్ని మరోసారి ముమ్మరం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా మహమ్మారి (Corona virus) మరోసారి పంజా విసురుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక , ఢిల్లీ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా..మిగిలిన రాష్ట్రాల్లో సైతం  కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (Ap government) అప్రమత్తమైంది. మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షల్ని ముమ్మరం చేసింది. ఏపీలో గత 24 గంటల్లో 31 వేల 260 కరోనా పరీక్షలు (Covid tests) నిర్వహించగా..1398 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 9 లక్షల 5 వేల 946 మందికి కరోనా మహమ్మారి సోకింది.  ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసింది.


గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 787 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ 8 లక్షల 89 వేల 295 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో అయితే కరోనా బారిన పడి గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, వైఎస్సార్ కడప , కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా 7 వేల 234 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 వేల 417 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1 కోటి 51 లక్షల 77 వేల 364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 


Also read: Zilla parishad Elections: ఓటమి భయంతోనే చంద్రబాబు బహిష్కరణ డ్రామా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook