Yatra 2: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది ఎంతవరకూ వాస్తవం..ప్రభుత్వం అలా ఆదేశాలు జారీ చేయడం సమంజసమేనా ఇప్పుడివే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అసలు ఈ ఆదేశాల్లో నిజానిజాలేంటని జీ న్యూస్ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా 2019లో విడుదలైన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర2 సినిమాను  తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రభుత్వమో ప్రమోట్ చేస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. ధియేటర్లను తొలి రెండ్రోజులు హౌస్‌ఫుల్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు ఓ జీవో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది తప్పకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో ఉన్నాయి. ఇది ఎంతవరకూ నిజమే ఆ జీవోను సునిశితంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. జీవో అడుగున ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరిగా నీలం సహానీ పేరుంది.


ఈ జీవో చూస్తే నిజమే అనుకుంటారంతా. కానీ ఫ్యాక్ట్‌చెక్‌లో ఈ జీవో తప్పని తేలింది. ఈ జీవో అడుగున ఛీఫ్ సెక్రటరీగా నీలం సహానీ పేరుండటంతో ఫేక్ జీవో అని తేలిపోయింది. ఇప్పుడు ఛీఫ్ సెక్రటరీగా ఉన్నది.


Also read: Indian Railway Rules: టికెట్ ఉన్నా సరే రైల్వే టీటీ మిమ్నల్ని రైల్లోంచి దింపేయగలడు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook