PCV Vaccine: ప్రాణాంతకంగా మారిన న్యుమోనియోను ఇరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్‌(Corona Vaccination)తో పాటు మరో ప్రాణాంతక వ్యాధిని అరికట్టే వ్యాక్సినేషన్ జరుగుతోంది. న్యుమోనియా వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో నెలల చిన్నారికి పీసీవీ వ్యాక్సిన్ ఇచ్చారు. పిల్లల్లో న్యుమోనియో మరణాల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు అదికారులు చెప్పారు. పిల్లలకు సంబంధించి ఇప్పటి వరకూ 9 రకాల వ్యాక్సిన్‌లను ప్రభుత్వం అందిస్తోంది. కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌తో కలిపి మొత్తం పది రకాల వ్యాక్సిన్‌లు ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో న్యుమోనియో మరణాల రేటు పెరగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ తరుణంలో న్యుమోకోకల్ వ్యాక్సినేషన్(Pneumonia Vaccine) మంచి ఫలితాలనిస్తుందని భావిస్తున్నారు. 


Also read; AP Corona Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా వైరస్ సంక్రమణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook