AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ఓ నెల రోజుల్నించి ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. అటు పాజిటివ్ రేటు సైతం తగ్గుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్‌తో(Corona Second Wave) విలవిల్లాడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు క్రమంగా కోలుకుంటోంది. కరోనా వైరస్ సంక్రమణ తగ్గుముఖం పట్టింది. ఏపీలో గత 24 గంటల్లో 69 వేల 606 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కేవలం 1546 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అటు 18 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 428 మంది కోవిడ్‌తో మరణించారు. అటు గత 24 గంటల్లో 1940 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 37 వేల 956 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల 170 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 19 లక్షల 71 వేల 554 మందికి ఇప్పటి వరకూ కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 47 లక్షల 78 వేల 146 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Test) చేశారు. 


గత 24 గంటల్లో చిత్తూరులో అత్యధికంగా 284 కరోనా పాజిటివ్ కేసులు, కృష్ణా జిల్లాలో 259, ప్రకాశం జిల్లాలో 185, పశ్చిమ గోదావరి జిల్లాలో 195 కరోనా కేసులు నమోదు కాగా, నెల్లూరులో 186, గుంటూరులో 130 మందికి కోవిడ్ సోకింది.


Also read: బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు ప్రారంభ తేదీ ఖరారు, పాల్గొనేవారి జాబితా ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook