Goutham Reddy Funerals: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో, నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందర్నీ షాక్‌కు గురి చేసింది. దుబాయ్ నుంచి రావడం..అంతలోనే విగతజీవుడిగా మారిపోవడం అంతా కలగా మిగిలిపోయింది. నిన్న అందరితో మాట్లాడిన వ్యక్తి ఇవాళ లేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేస్తోంది. దుబాయ్ నుంచి నిన్ననే ఇండియాకు వచ్చిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు పోయాయి. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే మంత్రి గౌతమ్ రెడ్డి ఇంతలా హఠాత్తుగా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


మంత్రి గౌతమ్ రెడ్డి తనయుడు అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తనయుడు వచ్చిన తరువాత అంటే బుధవారం నాడు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ఇవాళ రాత్రి వరకూ అక్కడే ఉంచి..ఆ తరువాత అంటే రేపు ఉదయం స్వగ్రామమైన నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లికి తరలిస్తారు. అక్కడే ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. అంత్యక్రియలకు ముఖమంత్రి వైఎస్ జగన్, మంత్రివర్గం, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ మంత్రులు కూడా హాజరుకానున్నారు. 


Also read: Goutam Reddy Death Reasons: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వెనుక కారణమేంటి, పోస్ట్ కోవిడ్ ప్రభావమా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook