Ap Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలి ఇంకా మారలేదు. వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అదే తరహా ఉత్తర్వులిచ్చారు. ఈసారి కూడా మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh Kumar ) మరోసారి మంత్రితో పేచీకు దిగారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాస్పద అంశాల్లో పరిధి దాటి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా మళ్లీ పరిది దాటారని తెలుస్తోంది. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra reddy ) ని నివాసం నుంచి బయటకు రాకుండా  పరిమితం చేయాలని డీజీపీకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యల కారణంగా చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని..ఎస్ఈసీ లేఖలో తెలిపారు. పంచాయితీ ఎన్నికలు ( Panchayat Elections ) ముగిసేవరకూ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో కూడా మాట్లాడకుండా చేయాలని సూచించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన క్లిప్పింగుల్ని జత చేశారు. 


ఎస్ఈసీ ఉత్తర్వులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Dgp Gowtham Sawang )స్పందించారు.  ఎస్ఈసీ నుంచి తమకు ఇంకా ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాల అందిన తరువాత పరిశీలిస్తామని చెప్పారు. తాను రాజకీయాలు మాడ్లాడనని..వ్యక్తగత విషయాల్లోకలగజేసుకోనన్నారు. ఎస్ఈసీ ఆదేశాలు అందిన తరువాత క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


Also read: AP Panchayat Elections 2021: ఏపీ ఎస్ఈసీ E-Watch Appపై High Court కీలక నిర్ణయం, Nimmagadda Ramesh Kumarకు షాక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook