AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 15 వందలకు చేరువలో ఉంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి ఏపీలో దాదాపుగా తగ్గిపోయింది. రాష్ట్రంలో కరోనా కేసులు కూడా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 65 వేల 5 వందలమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కేవలం 1506 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. గత 24 గంటల్లో 16 మంది మరణించగా..రాష్ట్రంలో ఆ సంఖ్య 13 వేల 647కు చేరుకుంది. మరోవైపు 1835 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 62 వేల 185 మంది కోలుకోగా..మొత్తం కేసుల సంఖ్య 19 లక్షల 93 వేల 697గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 17 వేల 865 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో 2 కోట్ల 55 లక్షల 61 వేల 449 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. 


Also read: AP Independence Day Celebration: కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చిన వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook