AP Corona Update: కరోనా వైరస్ ఉధృతి ఏపీలో గణనీయంగా తగ్గుతోంది. దాదాపు నెలరోజుల్నించి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.రాష్ట్రంలో గత 24 గంటల్లో 93 వేల 785 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..2 వేల 526 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 22మంది మృతి చెందారు. ఏపీలో గత 24 గంటల్లో 2 వేల 933 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 లక్షల 93 వేల 498 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 81 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 వేల 526 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 32 వేల 105 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 33 లక్షల 14 వేల 697 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు.


రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 404 కేసులు, చిత్తూరులో 391, పశ్చిమ గోదావరి జిల్లాలో 235, ప్రకాశం జిల్లాలో 308 కేసులు నమోదయ్యాయి. అటు కృష్ణా జిల్లాలో 269 కేసులు నమోదయ్యాయి.


Also read: Parliament Monsoon Sessions: వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook