AP Corona Update:కరోనా వైరస్ కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గుతున్నాయి.రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఏపీలో మరింతగా ఆంక్షలు సడలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి ఏపీలో తగ్గుతూ వస్తోంది. గత కొద్దిరోజుల్నించి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 వేల 758 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2 వేల 224 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. 31 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 12 వేల 630కు చేరుకుంది. మరోవైపు 4 వేల 714 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 24 వేల 319 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 42 వేల 252 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 18 లక్షల 4 వేల 691 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు.


Also read: AP Curfew Timings: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు, జులై 1 నుంచి అమలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook