AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సంక్రమణ తగ్గుముఖం పడుతోంది. ఓ వైపు కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూనే మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి దాదాపుగా తగ్గింది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 59 వేల 198 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కేవలం 1 వేయి 63 మందికి మాత్రమే కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. అటు 11 మంది కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 671 మంది మృత్యువాత పడ్డారు. 


గత 24 గంటల్లో ఏపీలో 1929 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 65 వేల 657 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 57 లక్షల 67 వేల 609 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో చిత్తూరులో అత్యధికంగా 211, నెల్లూరులో 198, పశ్చిమ గోదావరి జిల్లాలో 147, గుంటూరు జిల్లాలో 104 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఏపీలో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే..కరోనా థర్డ్‌వేవ్‌(Corona Third Wave)ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. 


Also read: Ys Jagan Review on Covid19: కరోనా థర్డ్‌వేవ్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook