క్యాన్సర్ పై అందరికి అవగాహన ఉండాలి. అవగాహనతో క్యాన్సర్ వ్యాధిని జయించవచ్చు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష అన్నారు. శనివారం ఉదయం విశాఖలోని రామకృష్ణ బీచ్ లో 'క్యాన్సర్ అవేర్నెస్ వాక్'  జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటి గౌతమి, బాలకృష్ణ పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. " పేదలకు క్యాన్సర్ వైద్యం అందించాలనే లక్ష్యంతో స్వర్గీయ ఎన్ఠీఆర్ బావసతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పారు. 40 పడకలతో మొదలైన ఆసుపత్రి ఇప్పుడు 512 పడకలకు చేరుకుంది" అన్నారు. ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ పై అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. క్యాన్సర్ వ్యాధిని జయించిన పలువురికి అభినందన పత్రాలు అందజేశారు. బాలకృష్ణ 102వ చిత్రం 'జైసింహ' షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.