Sajjala on Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వరదలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విపత్తుల్లో బాబు ఫోటో విన్యాసాలు తప్ప ఇంకా ఏమి కనిపించలేదన్నారు. వరదల్లో చంద్రబాబు మురికి రాజకీయాలకు సాక్ష్యాలను చూపించారు. ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని ఏ ఒక్కరితోనూ చెప్పించలేకపోయారని ఫైర్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో వరద బాధితులకు రూ.2 వేలు తక్షణ సాయం అందించిన ఏకైన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు సజ్జల. ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో చంద్రబాబు ఏనాడైనా ఆదుకున్నాడా అని ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం వరకు పవర్‌లో ఉండి..ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదన్నారు. ఇవాళ పక్క రాష్ట్రంతో పోల్చడం ఏంటని మండిపడ్డారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఇచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రైతుల గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2017-19 మధ్య ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారని..దానిని వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఒక ఫెయిల్యూర్ లీడర్ అని సెటైర్లు వేశారు. వరదల్లో చావుల కోసం ఎదురు చూసే వ్యక్తి బాబు అని మండిపడ్డారు. ఆయన రాజకీయ జీవితమంతా వెన్నుపోటులేనన్నారు. 


Also read:Video Viral: కదులుతున్న రైలులో మంటలు..ప్రయాణికుల పరుగులు..వీడియో వైరల్..!


Also read:Harish Rao: బీజేపీ మాటలు వింటే ఆగం..కాంగ్రెస్‌ను నమ్మితే మోసం..హరీష్‌రావు ధ్వజం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook