కర్నూలు, కడప జిల్లాల్లో ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఆయా జిల్లాల్లోని ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమైన చంద్రబాబు పోలింగ్ సరళి, గెలుపు అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని  నాయకులు చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఫలితాల  గురించి మాట్లాడుతూ ఈ సారి వందశాతం మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని స్థానిక నేతలకు తెలిపారు.


కడప జిల్లా ఒంటమిట్టలో గురువారం నిర్వహించిన కోదండరామ స్వామి కల్యాణోత్సవానికి సీఎం హాజరయ్యారు.  ఈ ఉదయం కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అనంతరం కర్ణాటకలోని రాయచూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ  కర్నూలు విమానాశ్రయానికి సీఎం చేరుకున్నారు. ఈ సమయంలో కర్నూలు జిల్లా నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై సుదీర్ఘ చర్చ  జరిగింది