Polavaram Project: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) ప్రజల లైఫ్‌లైన్ పోలవరం ప్రాజెక్టు ( Polavaram Project ). దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Former cm ys rajasekhar reddy ) ప్రారంభించిన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2021 డిసెంబర్ లక్ష్యంగా పనులు వేగవంతమయ్యాయి. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీళ్లు అందించాలనేది ప్రభుత్వ సంకల్పంగా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ), ఇతర అధికారులు పోలవరంపై సమీక్ష నిర్వహించారు. 


పోలవరం ప్రాజెక్టు ( Polavaram Dam ) లో కీలకమైన ఘట్టానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన స్పిల్ వే ఛానెల్ ( Spillway channel ) ‌లో కాంక్రీట్ పనుల్ని మొదలుపెట్టారు. 2020 వరదల కారణంగా స్పిల్ ఛానెల్ మట్టి పనులు, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. నవంబర్ 30 నుంచి వరద నీటిని తోడటం ప్రారంభించారు. ఇప్పుడు మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు ( Spillway concrete works ) మొదలెట్టారు. ఇప్పటివరకూ 2.5 టీఎంసీల నీటిని తోడినట్టు అధికారులు తెలిపారు. మట్టి తవ్వకం, అంతర్గత రహదార్ల పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ 1 లక్షా 10 వేల 33 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి కాగా..స్పిల్ ఛానెల్‌లో 10 లక్షల 64 వేల 417 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. మిగిలిన పనుల్ని జూన్ నెలలోగా పూర్తి చేయనున్నారు. 


Also read: AP: జగన్ పాలనపై యూఎస్ ప్రశంసలు, విశాఖలో హబ్ ఏర్పాటు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook