ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఎవ్వరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తనకు పార్టీ తరపున నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం లేదనే కారణంతో మనస్తాపానికి గురైన శివ చారి అనే కాంగ్రెస్ పార్టీ నేత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయాడు. విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన పార్టీ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అదే సమయంలో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు శివ చారిని పురుగుల మందు తాగకుండా అడ్డుకుని అతడిని పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ మేరకు ది హన్స్ ఆఫ్ ఇండియా ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమక్షంలో శివ చారి చేసిన ఆత్మహత్యాయత్నం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనియాంశమైంది.