AP Corona Update: దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. అటు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న కఠిన చర్యల కారణంగా కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుతున్నాయి. ఏపీలో వరుసగా ఐదవరోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్(Corona Virus) తగ్గుముఖం పడుతోంది. మొన్నటివరకూ రోజుకు 21-22 వేల కేసుల నమోదవుతూ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కరోనా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం (Ap government) కఠినంగా రోజుకు 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 79 వేల 564 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..13 వేల 4 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 94 మంది కోవిడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మరణించారు. మరోవైపు గత 24 గంటల్లో 21 వేల 133 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 16 లక్షల 82 వేల మందికి కరోనా సోకగా..మరణాల సంఖ్య 10 వేల 832 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్షా 98 వేల యాక్టివ్ కేసులున్నాయి. అటు ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1 కోటి 90 లక్షల 88 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు. 


ఏపీలో గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 598 కేసులు, చిత్తూరులో 1971, విశాఖపట్నంలో 1054, అనంతపురంలో 1215 కేసులు వెలుగు చూశాయి.


Also read: 2 Years Of YS Jagan Rule In AP: తన రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook