తూర్పుగోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలింది. వైసీపీ కోఆర్డినేటర్, రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు ఆ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నా.. 2019 ఎన్నికలకు సంబంధించి రాజోలు అభ్యర్థి విషయంలో అధినేత జగన్మోహన్ రెడ్డి సరిగా స్పందించడం లేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు అల్లూరి కృష్ణంరాజు ప్రకటించారు.


అటు జనసేన పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరగా.. గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ సమక్షంలో టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేన కండువా కప్పుకున్నారు.