HINDUPUR MLA Nandamuri Balakrishna attended on the future of Rayalaseema water projects: రాయలసీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తా అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (HINDUPUR MLA Balakrishna) అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల (Rayalaseema water projects) భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ టీడీపీ నేతలు (TDP leaders) సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Good news: ఇక నుంచి సినిమా థియేటర్లలో ప్రపంచకప్ మ్యాచ్ లు..!


ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ (NTR) ఎంతో కృషి చేశారన్నారు. రాయలసీమ కోసం ఎన్టీఆర్‌ హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొచ్చారని గుర్తు చేశారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. బీటీ ప్రాజెక్టుకు, చెరువులకు, అనంత జిల్లాలోని అన్ని చెరువులకు వెంటనే నీరివ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) బాలకృష్ణ డిమాండ్ చేశారు.


Also Read : Dussehra : దసరా సందర్భంగా రికార్డ్‌ స్థాయిలో మాంసం, మద్యం అమ్మకాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి