అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవోగా కేఎస్ జవహర్‌ రెడ్డి (Jawahar Reddy)ని నియమించారు. జవహర్‌రెడ్డి ప్రస్తుతం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్పెషప్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని టీటీడీ ఈవో (Jawahar Reddy is new TTD EO)గా బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి జీవో జారీ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా సేవలందించిన అనిల్ కుమార్ సింఘాల్‌ను ఇటీవల వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్శదర్శికి టీటీడీ ఈవోగా బాధ్యతలు అగప్పించారు. తిరుమల (Tirumala)లో ఈ నెల 15 నుంచి 24 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 9న ఉదయం 11 గంట లకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe