నవరత్నాల పథకాలు ప్రకటించి జనాల్లో దూసుకెళ్లున్న వైసీపీ అధినేత జగన్ కు ...ధీటైన ఫథకాలు రూపొందించి జనాల్లో మరింత వేగంతో దూసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన చంద్రబాబు..మరింత వేగంగా ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో పథకాల రూపకల్పన కోసం యనమల అధ్యక్షతన  ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చేశారు. కాల్వ శ్రీనివాసులకు కన్వీనర్‌గా బాధ్యతలు..పలువురు మంత్రులకు మేనిఫెస్టో కమిటీలో చోటు కల్పించారు.


చంద్రబాబు ఆదేశాలతో  జనాలు మెప్పు కోసం సరికొత్త పథకాల రూపకల్పన పనిలో పడ్డారు కమిటీ సభ్యులు.ఈ క్రమంలో మేనిఫెస్టో కమిటీ ఈ రోజు తొలిసారిగా భేటీ అవుతోంది. ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఓట్లు సాధించేందుకు వీలుగా ఏ పథకాలతో ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ కమిటీ చర్చించి నిర్ణయాలను తమ అధినేత  చంద్రబాబు ముందుంచుతుంది.