టీడీపీ కార్యకర్తలపై దాడులు, అరెస్టులను అనేక సందర్భాల్లో... అనేక వేదికలపై ఖండించిన టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ఈ అంశంపై మరో మారు ట్విట్వర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ విద్యార్ధి విభాగానికి చెందిన వర్ధన్ పై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టిన నారా లోకేష్ .. చివరికి విద్యార్థి మీద అక్రమ కేసులు పెట్టే స్థాయికి వైసీపీ సర్కార్ దిగజారిపోయిందని ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోట్ చేస్తూ ....  మీరెన్ని ఇబ్బందులకు గురిచేసినా.. నేనూ, మా పార్టీ వారు వర్ధన్ కి అన్ని విధాలుగా అండగా ఉంటామని లోకేష్ పేర్కొన్నారు. ఇలాంటి  మీ పిరికిపంద చర్యలను  తప్పకుండా తిప్పికొడతామన్నారు. ఈ ట్వీట్ కు ''మేం వర్థన్ కు సపోర్ట్ గా ఉంటాం '' ..'' మేం  వర్థన్ తో ఉంటాం " అనే హ్యాట్ ట్యాగ్స్ పెట్టారు.