2019 ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగే స్థానంపై కొంత క్లారిటీ వచ్చింది. అనంతపురం జిల్లా నుంచి బరిలోకి దిగుతారని జనసేనపార్టీ ఉపాధ్యక్షుడు  మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్లొన్న ఆయన.. ఈ విషయాన్ని బయటపెట్టేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ తొలివారం తరువాత తన పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నారని అన్నారు. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు