Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయ కార్యదర్శిగా బాబును బదిలీ చేయగా సీసీఎల్ఏ కార్యదర్శిగా పనిచేస్తున్న చక్రవర్తిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డెయిరీ డెవలప్​మెంట్ ఎండీగా ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు.


సీసీఎల్ఏ కార్యదర్శిగా పనిచేస్తున్న బీహెచ్ఎన్ చక్రవర్తిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లా గ్రామవార్డు సచివాలయాల జేసీ జి.గణేశ్ కుమార్​ను సీసీఎల్ఏలో జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఏలూరు ఆర్డీవో పి.రచనను సీసీఎల్ఏలోని సీఎంఆర్​వో ప్రాజెక్టు డైరెక్టర్​గా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎన్. తేజ్​ భరత్​ను సీసీఎల్ఏ కార్యాలయంలో విజిలెన్సు జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


Also read: YSRCP Formation Day: జగన్‌ సమర్థుడైన సీఎం.. ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి: డిప్యూటీ సీఎం ధర్మాన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook