Van overturned in AP - Seven people died: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం ( road accident ) సంభవించింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి కింద పడటంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా ( East Godavari ) లోని గోకవరం మండలం తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. మండలంలోని టాకుర్‌పాలెం యువకుడు.. రాజనగరం మండలం వెలుగుబందాకు చెందిన యువతికి గురువారం రాత్రి తంటికొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. Also read: BJP workers murder: బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం వధూవరుల కుటుంబసభ్యులు దాదాపు 20 మంది వ్యానులో కొండపై నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అర్థరాత్రి వ్యాన్ అదుపుతప్పి మెట్ల మార్గం నుంచి కొండ కిందకు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. 


సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది ప్రయాణికులు ఉన్నారని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe