సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఒక బృందం కూడా వచ్చింది. సింగపూర్ నుండి నేరుగా మంత్రి ఈశ్వరన్ బృందం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి  చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన సచివాలయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. ఇంత తక్కువ సమయంలో సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించారని ఈశ్వరన్ సీఎం ను కొనియాడారు. అలానే అసెంబ్లీని కూడా సందర్శించారు. ముఖ్యమంత్రి ఈశ్వరన్ బృందానికి ప్రత్యేకంగా అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం సింగపూర్ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులపై వీరి మధ్య జరిగింది.