AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ కేసుల్లో స్వల్ప తగ్గుదల కన్పించింది. గత కొద్దిరోజులుగా 20 శాతం వరకూ పాజిటివిటీ రేటుతో భారీగా పెరిగిన కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మరోవైపు కరోనా మహమ్మారి నియంత్రణకై రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. తాజాగా ఏపీలో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 73 వేల 749 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా..18 వేల 561 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్నటితో పోలిస్తే ఇది కాస్త తక్కువ. నిన్న పాజిటివిటీ రేటు 20 శాతం వరకూ ఉండగా..ఇప్పుడు కాస్త తగ్గింది. 


రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14 లక్షల 54 వేల 52 మంది కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే 109 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 9 వేల 481కు చేరుకుంది. గత 24 గంటల్లో 17 వేల 334 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 12 లక్షల 33 వేల మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 2 లక్షల 11 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1 కోటి 80 లక్షల 49 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. ఏపీలో కరోనా నియంత్రణకు పది రోజుల సమయం సరిపోదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మే 31 వరకూ కర్ఫ్యూని పొడిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.


Also read: Raghuramakrishnam raju episode: రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook