అమరావతి: పార్లమెంటరీ అంచానాల కమిటీలో టీడీపీ ఎంపీ కేశినేని నాని చోటు దక్కించుకున్నారు. కేశినేనితోపాటు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. మొత్తం 31 మంది సభ్యులు నామినేషన్ వేయగా.. అందులో ఇద్దరు సభ్యులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో చివరకు 29 మందిని ఈ కమిటీలో సభ్యులుగా ఎంపిక చేస్తున్నట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన ఏప్రిల్ 30తో ఈ కమిటీ కాలపరిమితి ముగియనుంది. 


వార్షిక బడ్జెట్ అంచనాలను పరిశీలించి, వ్యయంలో పొదుపు చర్యలు తీసుకొనేలా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించడమే ఈ కమిటీ ఏర్పాటు వెనుకున్న ముఖ్య ఉద్దేశం అనే సంగతి తెలిసిందే.