Accident In Puthalapattu: అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వివాహానికి వెళుతున్నారు. ఎంతో సంతోషంగా వెళుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం నిండుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాలు ఇలా.. ఐరాల మండలం బలిజపల్లెకు చెందిన హేమంత్‌ వివాహం గురువారం జరగాల్సి ఉంది. పూతలపట్టు మండలం జెట్టిపల్లెలో పెళ్లికి
హేమంత్ బంధువులు 26 మంది ట్రాక్టర్‌లో బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు ట్రాక్టర్ పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపానికి చేరుకుంది. అయితే ఏటవాలుగా ఉండడంతో డీజిల్ ఆదా చేద్దామని డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేశాడు. 


దీంతో డ్రైవర్ ట్రాక్టర్‌ను అదుపు చేయలేకపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మృతులను ట్రాక్టర్ డ్రైవర్ సురేందర్‌ రెడ్డి (51),  వసంత (45), రెడ్డమ్మ (31), తేజ (25),  దినేశ్‌ (4), దేషిక (2)గా గుర్తించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు ఉండగా.. తండ్రి తీవ్రంగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


ఈ ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి స్విమ్స్‌, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, వేలూరు సీఎంసీకి తరలించారు. పెళ్లి కుమారుడు హేమంత్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారితే పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వధూవరుల గ్రామాల ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  


Also Read: Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు ముఖ్యగమనిక.. మరోసారి కీలక మార్పులు  


Also Read: Salman Pooja Dating: సల్మాన్‌ ఖాన్‌తో పూజా హెగ్డే ప్రేమాయణం.. ఇదేక్కడి లింక్ రా బాబు.. ట్వీట్ వైరల్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి