ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్భుతమైన విజయం సాధించడంపై జగన్‌ని అమిత్ షా అభినందించారు. భేటీ సందర్భంగా ఏపీలో నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.