ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటి మంగళవారంతో 193వ రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం పి.గన్నవరం సెంటర్ నుండి వైఎస్ జగన్ తన పాద యాత్రను ప్రారంభించారు. పి.గన్నవరం, లంకల గన్నవరం, జొన్నలంక, మొండెపులంక, కందాల పాలెం, నాగుల్లంక, చాకలిపాలెం మీదుగా వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జగన్ పాదయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని తమ ప్రాంతాల్లోకి స్వాగతం పలుకుతున్నారు.


వైఎస్ జగన్ తాను వెళ్లిన ప్రతీ చోట అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగిపోతున్నారు.