బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పెరిగాయి. మరోవైపు మార్కెట్‌లో వెండి ధర పుంజుకుంది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.420 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,250కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,820కి పుంజుకుంది.



దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) నేడు పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.320 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,970కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 పుంజుకుంది. దీంతో 10 గ్రాముల ధర రూ.49,600 వద్ద మార్కెట్ అవుతోంది.



మరోవైపు వెండి ధర (Silver Rate in India) సైతం బంగారం బాటలోనే పయనిస్తూ మార్కెట్‌లో పరుగులు పెడుతోంది. తాజాగా వెండి ధర రూ.1500 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,900కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe