Gold Price Today 21st December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు డిసెంబర్ నెలలో భారీగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ నుంచి బంగారం కొనుగోలు చేయాలంటేనే పలు రకాలుగా ఆలోచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇటీవల రూ.51వేలు దాటి పరుగులు పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు స్థిరంగా పుంజుకుంటున్నాయి. వెండి ధర రూ.70 వేల మార్క్ చేరినా తగ్గేలా కనిపించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.460 మేర పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,070 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.400 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,810కి పెరిగింది.


Also Read: Bigg Boss Telugu 4 Grand Finale: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడా! కథ వేరే ఉందా?



దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price Today) మరోసారి పెరిగాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.460 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,420కి పుంజుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,980 అయింది.


Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?



బులియన్ మార్కెట్‌లో డిసెంబర్‌లో వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ(Delhi) మార్కెట్‌లో వరుసగా అయిదో రోజు వెండి ధర (Silver Rate in India) పెరిగింది. తాజాగా రూ.900 మేర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,900కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.71 వేలు దాటింది. తాజాగా రూ.100 మేర పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,600 వద్ద ట్రేడ్ అవుతోంది.  


Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook