Gold Price Today 24th December 2020: డిసెంబర్ నెలలో బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.440 మేర తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.50,830 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.400 మేర పతనం కావడంతో 10 గ్రాముల ధర రూ.46,600కి దిగొచ్చింది.


Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే



దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price Today) వారం రోజుల నుంచి వరుసగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.310 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,720కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.280 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,250 అయింది.


Also Read: Infinix Smart HD 2021 Price In India: బడ్జెట్ ధరకే 5000mAH స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే



బులియన్ మార్కెట్‌లో డిసెంబర్‌లో భారీగా పెరిగిన వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. అయితే ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు వెండి ధర తగ్గింది. తాజాగా రూ.800 మేర తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.70 వేలకు దిగొచ్చింది. తాజాగా రూ.1,500 మేర దిగిరాగా... దీంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,500కి క్షీణించింది.


Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook